గాజులరామారం, అక్టోబర్ 29: తెలంగాణ ఉద్యమకారుడు, జననాట్య మండలి సీనియర్ కళాకారుడు జంగ్ ప్రహ్లాద్ ఈ నెల 27 అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం నిమ్స్కు తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం జంగ్ ప్రహ్లాద్ మృతి చెందినట్టు వదంతులు రావడంతో ఆయన కుటుంబసభ్యులు ఖండించారు. ప్రహ్లాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. జంగ్ ప్రహ్లాద్ త్వరగా కోలుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులతోపాటు తెలంగాణ ఉద్యమకారులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ప్రహ్లాద్ ఆరోగ్య పరిస్థితిని నిమ్స్లో డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.