వనపర్తి (నమస్తే తెలంగాణ)/పెబ్బేరు రూరల్, డిసెంబర్ 4: రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శాఖాపూర్లో శుక్రవారం రాత్రి మంత్రి పల్లెనిద్ర చేశారు. శనివారం ఉదయం గ్రామంలో పర్యటించారు. 4 గంటలపాటు కాలినడక వెళ్లి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. పలువురు వివిధ సమస్యలను మంత్రి కి వివరించారు. వరి కొనుగోళ్లు సరిగా జరగడం లేదని పలువురు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.