తెలంగాణచౌక్, జూలై 28: సీఎం కేసీఆర్ను తెలంగాణ ఉద్యమ నేతగా అభిమానిస్తామని, పేద ప్రజల కోసం ప్రవేశపెడుతున్న పథకాలు బాగున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మనేని వీరభద్రం కొనియాడారు. దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని సీపీఎం స్వాగతిస్తుదన్నారు. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాని కోరారు. బుధవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్ తన రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీలోకి చేరాడని విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీని ఓడించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.