నిజామాబాద్ : ఇందూరు కాంగ్రెస్ పార్టీలో ఆదిపత్య పోరు మొదలైంది. సీనియర్ రాజకీయ నేత ఢి. శ్రీనివాస్, ఆయన కుమారుడు సంజయ్లు తిరిగి సొంత గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. వీరు కాంగ్రెస్లో చేరడం ఆ పార్టీ నిమాబాద్ జిల్లా ఇన్చార్జి మహేష్గౌడ్కు మింగుడు పడటం లేదు. డీఎస్, ఆయన కుమారుడు పార్టీలో చేరడం వల్ల కాంగ్రెస్కు ఒరిగేదేమీ లేదని మహేష్ గౌడ్ అన్నారు. అసలు ఎవరిని అడిగి వాళ్లను పార్టీలో చేర్చుకున్నారో తెలియదన్నారు. పీసీసీ జిల్లా అధ్యక్షుడిని నాకే సమాచారం లేదన్నారు. నిజమాబాద్ అర్బన్ టికెట్ ఇస్తామని తనకు పార్టీ హామీ ఇచ్చిందని మహేష్ తెలిపారు. ఐతే.. పార్టీలో చేరిన డీఎస్ తనయుడు సంజయ్ కూడా అర్బన్ టికెట్ ఆశిస్తున్నాడు. అందుకే పార్టీలో చేరినట్లు సమాచారం. దీంతో.. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి మొదలైంది. ఈ లొల్లిని కాంగ్రెస్ హైకమాండ్ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
డి. శ్రీనివాస్ ఆయన కుమారుడు సంజయ్ ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్లో పీసీసీ ఛీఫ్ రేంత్రెడ్డి సమక్షంలో వీరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ తెలంగాణ, సీనియర్లు విహన్మంతరావు, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమట్రెడ్డి వెంకట్రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య తదితరులు హాజరయ్యారు.