
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికాశాఖ మూడేండ్లుగా చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పార్టీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే, సౌతాఫ్రికాతోపాటు మిగతా ఆఫ్రికా దేశాల్లోనూ సేవలను విస్తృత పరిచారని సోమవారం అభినందించారు. సౌతాఫ్రికాలో ఉన్న తెలంగాణవారికి రెండు సందర్భాల్లో ఇబ్బంది కలుగగా, తాను తెలియజేయగానే శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు స్పందించి సహాయం అందించారని గుర్తుచేశారు. ఆ దేశంలోని తెలంగాణ బిడ్డలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటున్నారని చెప్పారు. పార్టీ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.