కవాడిగూడ, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 133వ జయంతిని ఘనంగా ఆదివారం నిర్వహించారు. లోయర్ ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఎం అనిల్కుమార్యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, మాజీ కార్పొరేటర్ పీ విజయారెడ్డి, మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి, అద్దంకి దయాకర్ పూల మాలలు వేసి నివాళులర్పించారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్, మాజీ మంత్రి, సికింద్రాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుగౌడ్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్ పాషా, ప్రొఫెసర్ కోదండరాం, బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం, సభ్యుడు సీహెచ్ ఉపేందర్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంకుమార్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే చింతల్డ, మాజీ ఎంపీ హెచ్, మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రాంచందర్, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్రెడ్డి, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జీ చెన్నయ్య తదితర దళిత సంఘాల నాయకులు నివాళులర్పించారు.
అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ కళాభవన్లో ఆయన చిత్రపటానికి ఆర్టీసీ ఈడీలు కృష్ణకాంత్, ముని శేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, ఎఫ్ఏ విజయ పుష్ప, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘ నాయకులు, ఉద్యోగులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ట్యాంక్బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్రావు, ప్రధానకార్యదర్శి సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షుడు బీ శ్యామ్, ఏ జగన్మోహన్రావు, ఉపేందర్రెడ్డి, పరమేశ్వర్రెడ్డి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.