హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తె లంగాణ): ఓటరు నమోదులో భాగంగా శనివారం నిర్వహించిన ప్రత్యేక క్యాంపు ల్లో 43 వేల దరఖాస్తులు అందినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. శని, ఆ దివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా బూత్స్థాయి లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండినవారు దరఖాస్తు చేసుకునేందుకు, ఓటు తొలగింపు, చిరునామా మార్పునకు అవకాశం కల్పించారు.
శనివారం కొత్త ఓటు కోసం 25,347 దరఖాస్తులు, ఓటు తొలగింపునకు 7,984, చిరునామా మార్పు, వివరాల సవరణకు 9,845 దరఖాస్తులు వచ్చినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. శనివారం జిల్లా ఎన్నికల అధికారులు 256 పోలింగ్స్టేషన్లను సందర్శించారు. 35,356 పోలింగ్ కేంద్రాలుండగా, 10 మంది బీఎల్వోలు మినహా మిగిలిన వారందరూ అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఆదివారం కూడా ప్రత్యేక క్యాంపులు ఉంటాయని సూచించారు.