హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 3,877 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో పేర్కొన్నది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 40 వేలు దాటింది. తాజాగా 2,981 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గురువారంతో పోల్చితే పాజిటివ్ కేసుల్లో కొంత తగ్గుదల కనిపించింది. పాజిటివ్ రేటు 4.09 శాతం నుంచి 3.80 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 94.11 శాతానికి తగ్గింది. కరోనా, ఇతర కారణాలతో ఇద్దరు మృతిచెందారు. శుక్రవారం అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,189, మేడ్చల్ మల్కాజిగిరిలో 348, రంగారెడ్డిలో 241, హనుమకొండలో 140, యాదాద్రి భునవగిరిలో 119, ఖమ్మంలో 112, నల్లగొండలో 133, పెద్దపల్లిలో 110, నిజామాబాద్లో 107, మంచిర్యాలలో 104 కేసులు వెలుగుచూశాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 2.58 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 44వేల మందికి మొదటి డోస్, 2.02 లక్షల మందికి రెండో డోస్, దాదాపు 11 వేల మందికి బూస్టర్ డోస్ వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21.93 లక్షల డోసులు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్లో కలిపి 53,573 పడకలు అందుబాటులో ఉన్నాయి.