ORR | హైదరాబాద్, అక్టోబర్18 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్రోడ్ (ORR) కాంట్రాక్ట్ వివాదంపై హెచ్ఎండీఏకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కాంట్రాక్టర్ సైబరాబాద్ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్కు రూ.360 కోట్లకు 12 శాతం వడ్డీతో చెల్లించాలన్న ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవరించింది. ఆ మొత్తంలో సగభాగం హెచ్ఎండీఏ చెల్లించాలని ఆదేశించింది. మిగిలిన మొత్తం చెల్లింపును నిలిపివేసింది.
ఆర్బిట్రేషన్ అవార్డు వ్యవహారంపై వాణిజ్య కోర్టు 2022 మార్చి 21న ఇచ్చిన ఉత్తర్వులను హెచ్ఎండీఏ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. హెచ్ఎండీఏ తర ఫు సీనియర్ న్యాయవాది రతన్సింగ్ వాది స్తూ, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో వాణిజ్యకోర్టు తమ వాదనల్ని పట్టించుకోలేని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు, సుప్రీంకో ర్టు, ఫామ్ డెవలప్మెంట్స్ కేసు తీర్పు ప్రకా రం డిపాజిట్ చేయాలని చెప్పింది. అవార్డు అమలుపై స్టే అడిగినపుడు పూర్తిమొత్తంగానీ, కొంతగానీ డిపాజిట్ చేయమనే అధికారం ఉందని గుర్తు చేసింది. అందుకే సగం డిపాజిట్ చేయాలని ఆదేశిస్తున్నట్టు పేర్కొన్నది.