వరంగల్ : వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోచంపల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునేందుకు సీఎం కేసీఆర్కు మనమంతా అండగా ఉండాలన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు.
ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డిని మంత్రి దయాకర్రావు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.