హైదరాబాద్, సెప్టెంబర్ 12: కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అసెంబ్లీలో ప్రకటించారు.
గతంలో ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం, బీసీలకు 35 శాతం, ఓసీలకు 40 శాతంగా కటాఫ్ మార్కులు ఉండేవి. సీఎం ప్రకటనతో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల శాతం తగ్గనున్నది. కాగా, ఆగస్టు 28న జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు మొత్తం 6,03,955 అభ్యర్థులు హాజరయ్యారు.