హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని సాగునీటి ఎత్తిపోతల పథకాలకు ఈ సీజన్లో 3 వేల మెగావాట్ల విద్యుత్తు అవసరమని అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ప్రాజెక్టుల వారీగా విద్యుత్తు డిమాండ్ను తెలుపుతూ ట్రాన్స్కోకు ఇండెంట్ పంపించారు. కాళేశ్వరం, పాలమూరు, ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ తదితర ఎత్తిపోతల పథకాలన్నింటికీ కలుపుకొని 7,110 మెగావాట్ల విద్యుత్తు అవసరం. ప్రస్తుతం అన్ని రిజర్వాయర్లలో సమృద్ధిగా నీరున్నందున అందులో సగానికంటే తక్కువ విద్యుత్తు అవసరముంటుందని అధికారులు అంచనా వేశారు. అందులో భాగంగా 3వేల మెగావాట్ల విద్యుత్తు అవసరముంటుందని అంచనా వేశారు.