హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణంలో మరో నిందితుడు మదన్ అర్జున్ పగర్ను శుక్రవారం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అకాడమీకి చెందిన ఎఫ్డీలు రూ.64.5 కోట్లు బ్యాంకుల నుంచి తీసేందుకు ఉపయోగించిన నకిలీ బాండ్లతోపాటు అకాడమీకి అందించిన నకిలీ పత్రాలపై అకాడమీ డైరెక్టర్, అకౌంట్స్ ఆఫీసర్, బ్యాంకు మేనేజర్నంటూ మదన్ సంతకాలు పెట్టినట్టు దర్యాప్తులో వెల్లడయింది. ఏపీలో నమోదైన రెండు కేసుల్లోనూ అతడు ఫోర్జరీ సంతకాలు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీపీ మనోజ్కుమార్ బృందం ఇప్పటివరకు 18 మంది నిందితులను అరెస్టు చేసింది.