హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): కేంద్ర నైపుణ్యాభివృద్ధి కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా మెదక్ లోక్సభ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి నియమితులయ్యారు. ఈ కమిటీకి చైర్మన్గా కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ వ్యవహరిస్తారు. ఎంపీ ప్రభాకర్రెడ్డితోపాటు తొమ్మిది మంది లోక్సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అనిల్కుమార్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.