Vera Clinics | హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న వేరా స్మార్ట్ హెల్త్కేర్ సంస్థ వేరా క్లినిక్స్.. తెలంగాణలోని వివిధ వైద్య సంస్థలతో డెఫినెటివ్ ఒప్పందంపై సంతకాలు చేసింది. దీంతో ఈ వైద్య సంస్థల వద్ద 300కి పైగా స్మార్ట్క్లినిక్స్ ఏర్పాటు చేయనున్నది. ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవడానికి మొబైల్ యూనిట్స్, డోర్ టు డోర్, స్మార్ట్ ట్రాన్స్పోర్ట్, మల్టీ సూపర్ స్పెషాలిటీ వసతులు కల్పించడం లక్ష్యంగా పని చేయనున్నది. వచ్చే ఐదేండ్లలో రూ.890 కోట్లకు పైగా (119 మిలియన్ డాలర్లు) ఖర్చు చేయనున్నది. తొలి దశలో రూ.112 కోట్లు ఖర్చు చేస్తామని వేరా క్లినిక్స్ తెలిపింది.
వేరా క్లినిక్స్.. సహకార నమూనాతో హెల్కేర్ రంగంలోకి టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నది. కృత్రిమ మేధ ఆధారిత వర్చువల్ హెల్త్ కేర్ టూల్స్తో హెల్త్ డిజిటలైజేషన్ సేవలు తీసుకొస్తుంది. ఈ వైద్య సంస్థల ఆధ్వర్యంలో మొబైల్ వెల్నెస్ హాస్పిటల్ సర్వీసెస్ ద్వారా ఈ సేవలు ప్రజలు అందుబాటులోకి తెస్తారు.
వేరా క్లినిక్స్ సీఈవో కం ఫౌండర్ ధర్మతేజ నూకారపు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఒప్పందం విలువ 119 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నాం. వచ్చే రెండేండ్లలో ప్రజలకు సేవలు అందించడానికి కృషిచేస్తాం. తొలి దశలో 15 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తామన్నారు. ఇప్పటికే తాము చేపట్టిన కాంట్రాక్టులతోపాటు ఫ్రెష్ ఆర్డర్లతో వైద్య సేవలందిస్తామని చెప్పారు.
రాష్ట్రంలోని వైద్య సంస్థల్లో తమ సాంకేతికంగా శిక్షణ పొందిన హెల్త్కేర్ స్టాప్, వ్యూహాత్మక క్లినిక్స్, మొబైల్ హెల్త్ కేర్ యూనిట్లు, ప్రొప్రైటరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అండ్ మొబైల్ అప్లికేషన్స్తో కూడిన సేవలు అందిస్తామని ధర్మతేజ నూకారపు చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామీణులతో అనుసంధానం కావడానికి వైద్య సంస్థలు, డోర్ టు డోర్ హెల్త్కేర్ ప్రాక్టీషనర్లు కృషి చేస్తారన్నారు.
కరోనా మహమ్మారి సమయంలో వేరా స్మార్ట్ హెల్త్కేర్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తరఫున 220 బస్సులతో వైద్య సేవలందించింది. తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల మందికి వైద్య పరీక్షలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 1000 హాస్పిటల్ బెడ్స్, 200 మంది డాక్టర్స్, 500 మంది నర్సులతో సేవలందిస్తున్నది.