హైదరాబాద్ : బీసీ (వెనుకబడిన తరగతుల) BC Commission కమిషన్ చైర్మన్ గా వకుళాభరణం కృష్ణమోహన్ రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీచేసింది. అదేవిధంగా ప్రభుత్వం శుభప్రద్ పటేల్, కిశోర్ గౌడ్, సీహెచ్ ఉపేంద్ర ను కమిషన్ లో సభ్యులుగా నియమించింది. బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుల హోదాలతో సమానంగా సదుపాయాలు కల్పించబడతాయి.