కందుకూరు:హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను సీఎం కేసీఆర్ ఎంపిక చేయడంతో బుధవారం ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు మండలంలో సంబురాలు జరుపుకున్నారు. నాయకులు హైదరాబాదు, శ్రీశైలం రహదారిపై పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉద్యమకారులకు న్యాయం చేస్తున్నట్లు తెలిపారు, ఉప ఎన్నికల్లో శ్రీనివాస్ యాదవ్ విజయం తధ్యమని చెప్పారు. ప్రతి పక్షాల మాటలను ప్రజలు నమ్మరని తెలిపారు.
యువజన విభాగం నాయకులు రామాంజనేయులు, సోషల్ మీడియ నాయకుడు బొక్క దీక్షిత్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్వీ అధ్యక్షుడు విష్ణు, కటికపల్లి, బాచుపల్లి సర్పంచ్లు బుడ్డొల్ల నరేందర్గౌడ్, యాలాల శ్రీనివాస్, కార్యదర్శి బర్కం వెంకటేష్,ఎంపీటీసీ సురేష్, కార్మిక విభాగం అధ్యక్షుడు నవీన్ కుమార్, చిప్పలపల్లి ఉప సర్పంచ్బాలక్రిష్ణ, యాదయ్య, మహేష్, తరుణ్,నాగేష్, విష్ణు, లడ్డూ, రాజు, సురేష్, వాసిమ్లు పాల్గొన్నారు.