TS Inter Board | తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఫలితాలు ఇటీవలే విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే.. ఇంటర్ ఫస్టియర్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కోసం ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం వచ్చే సంవత్సరం ఏప్రిల్లో పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు స్పష్టం చేసింది.
ఏప్రిల్లో జరగబోయే వార్షిక పరీక్షల్లోనే ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా పరీక్షలు రాసుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడించారు. అలాగే.. తాజాగా విడుదలైన ఫలితాలపై ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని జలీల్ తెలిపారు.
విద్యార్థులకు ఎవరికైనా ఫలితాల్లో అనుమానాలు ఉంటే.. సంబంధిత రుసుము చెల్లించి సమాధాన పత్రాలను పొందొచ్చని ఆయన వెల్లడించారు.