సూర్యాపేట: శాంతియుత వాతావరణం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాధ్యతగా వ్యవహారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్లో గల సిల్వీ చర్చిలో జరిగిన క్రిస్టియన్ పీస్ మేకర్స్ (సీపీఎం) అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు.
ఎక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంటుందో ఆ ప్రాంతమంతా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని నమ్మె వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆ దిశగానే రాష్ర్టాన్ని సాధించి గత ఏడేండ్లుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. కార్యక్రమంలో క్రైస్తవ పెద్దలు విల్సన్ సింగం, సిల్వీలతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండలాల పాస్టర్లు పాల్గొన్నారు.
దసరా వేడుకలకు మంత్రికిఆహ్వానం
ఈ నెల 15 వ తేదీన సూర్యాపేటలోని జమ్మిగడ్డలతో జరుగనున్న విజయదశమి వేడుకలకు సంతోషిమాత దేవస్థానం వారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయనను దేవాలయ నిర్వాహకులు మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత ఏడాది కరోనా కారణంగా వేడుకలు నిర్వహించలేక పోయాయన్నారు.
ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో వేడుకల నిర్వహణకు మంత్రి జగదీశ్ రెడ్డి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. మం త్రి ఆదేశాల మేరకు కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఆహ్వానించిన వారిలో బ్రాహ్మండ్ల మురళీ, ఉప్పల ఆనంద్, నరేంద్రుని విద్యాసాగర్, గోపా రపు రాజు, పబ్బ ప్రకాశ్ రావు తదితరులు ఉన్నారు.