కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు మూడు రోజులుగా ఇన్ఫ్లో నిలకడగా వస్తుండడంతో ఆదివారం మూడు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 4654.81 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది.
ప్రాజెక్టు 3క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 3982.40 క్యూసెక్కులు, కాలువలకు 573 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 643.05 అడుగులుగా (3.95 టీఎంసీలు) నిల్వ ఉన్నట్లు ఏఈ డి.ఉదయ్కుమార్ తెలిపారు.