హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలు బలోపేతం అయ్యాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్సీ కవిత నగరంలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కవిత ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎమ్మెల్సీ కవిత ఈ సమావేశంలో చర్చించారు.
రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపిన ప్రజా ప్రతినిధులు.. ఈసందర్భంగా పలు ప్రజా సమస్యలను ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా ప్రతినిధులు ప్రస్తావించిన పలు అంశాలను ఎమ్మెల్సీ కవిత వెంటనే సంబంధిత మంత్రులు, అధికారులతో చర్చించారు.