ఆత్మకూరు(ఎం): దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరెళ్ల రమేశ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ
దళిత బంధు ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు అందజేయడంతో దళితుల జీవితాలలో వెలుగులు నిండాయన్నారు. ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం లో టీఎమార్పీఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మందుల పరశురాములు, కదిరె నవీన్, నాయకులు గణేశ్, రవీందర్, ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ వెంకటేశ్తో పాటు చంద్రయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.