తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంక్షేమం పరుగులు పెట్టింది. సమసమాజ నిర్మాణానికి ప్రభుత్వం పునాదులు వేసింది. రాష్ట్రంలో ఏ ఒక్క కులాన్ని, మతాన్ని విస్మరించకుండా అన్ని కులాలు ఆత్మగౌరవంతో నిలబడేలా సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నది. అన్ని కులాలకు గుర్తింపునిచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలను నిర్మించేందుకు అత్యంత విలువైన భూములను కేటాయించడమే కాకుండా, రూ.10 కోట్ల చొప్పున నిధులిచ్చారు శుక్రవారం అసెంబ్లీలో సంక్షేమ రంగంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ
వర్గాలకు అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి భూమి, నిధుల కేటాయింపు
ఇతర సంక్షేమ కార్యక్రమాలు
రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 58 ద్వారా పేదల ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ చేసింది. లక్ష నాలుగు వేల మంది లబ్ధిదారులకు పట్టాలిచ్చింది.
అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో రూ.5 భోజనం ఏర్పాటు చేసింది. రోజూ 35 వేల మందికి భోజనం అందుతున్నది.
మరో 17 పట్టణాల్లోనూ రూ.5 భోజనం పథకం అమలుచేస్తున్నది.
హైదరాబాద్లో 224 బస్తీ దవాఖానాలు ఏర్పాటుచేసింది. సంవత్సరాంతానికి 300 బస్తీ దవాఖానలు ఏర్పాటుచేయనున్నది. బస్తీ దవాఖానాల ద్వారా 60 లక్షల 18 వేల మంది సేవలు పొందుతున్నారు.
డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం
రాష్ట్రవ్యాప్తంగా 2.91 లక్షల ఇండ్లు మంజూరు అయ్యాయి. ఇందులో లక్ష 3 వేల ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. మరో 70 వేల 602 ఇండ్ల నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. మరో లక్ష 17వేల ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి.
ప్రాజెక్టు వ్యయం రూ.19 వేల 126 కోట్లు
కిరాయి తిప్పలు తప్పె
భద్రాచలం, అక్టోబర్ 8: నిరుపేదలు సైతం విశాలమైన ఇంటిలో నివసించాలని సీఎం కేసీఆర్ ప్రారంభించిన డబుల్ బెడ్రూం పథకం పేదల కండ్లలో ఆనందం నింపుతున్నది. పూరి గుడిసెలు, రేకుల షెడ్లు, కిరాయి ఇండ్లలో ఇరుకిరుకు బతుకుల నుంచి విముక్తి కల్పించిన సీఎం కేసీఆర్కు తమ గుండెల్లో గుడి కట్టి పూజిస్తున్నారు. భద్రాచలం పట్టణానికి చెందిన అంబటికర్ర కృష్ణ రోడ్డు పక్కన కమ్మరి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నాలుగేండ్ల క్రితం ఇద్దరు పిల్లలతో అద్దె ఇంటిలో ఉండేవారు. అద్దెకట్టడం గగనమైన సమయంలో యజమానులు ఇల్లు ఖాళీ చేయమని బెదిరించేవారు. అలాంటి పరిస్థితిలో ప్రభుత్వం డబుల్ బెడ్రూం కేటాయించడంతో వీరి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.
నీటి సరఫరా
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రూపాయికే నల్లా కనెక్షన్ సౌకర్యలం కల్పించింది. అర్బన్ మిషన్ భగీరథ ప్రారంభించిన తర్వాత నీటి సరఫరాను 70 ఎల్పీసీడీల నుంచి 130 ఎల్పీసీడీలకు పెంచింది. మిషన్ భగీరథ
రాష్ట్రవ్యాప్తంగా 100 శాతం గ్రామీణ ఆవాసాలకు శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేస్తున్నది. మారుమూల ప్రాంతాలకు సైతం మిషన్ భగీరథ జలాలు సరఫరా అవుతున్నాయి.