CM KCR Press Meet : బీజేపీ రైతు రాబందు పార్టీ అని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్ర కేబినేట్ భేటీ అనంతరం.. ప్రెస్ మీట్ నిర్వహించిన సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
సాక్షాత్తూ ప్రధాన మంత్రే దేశంలోని రైతులకు క్షమాపణలు చెప్పారు. 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్న పార్టీ. హంతకుల పార్టీ. మీది రైతు రాబందు పార్టీ. వాస్తవం కాదా.. 750 మంది చచ్చిపోలేదా. 13 నెలలు వాళ్లు ఎండనకా.. వాననకా.. కరోనాలో నిరసన చేస్తే.. అప్పుడు పట్టించుకోకుండా.. ఇప్పుడు మాట్లాడుతున్నారా? మేము రైతు బంధువులం. మేము ప్రాజెక్టులు కట్టాం. ఎల్లంపల్లి, మిడ్ మానేరు, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిలసాగర్, దేవాదుల ప్రాజెక్టులు ఎవరు కంప్లీట్ చేశారు. అంతకుముందు ఈ ప్రాజెక్టులన్నీ దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నాయి. వీళ్లు ముంచేవాళ్లు తప్పితే మంచి చేసేవాళ్లు కాదు. తెలిపోయింది. ఇది 100 శాతం రైతు వ్యతిరేక పార్టీ.. అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం తరుపున, రైతుల తరుపున.. మంత్రులు, ఎంపీలు, సీఎస్ వెళ్తే మీకు వేరే పనిలేదా.. అని కేంద్ర మంత్రి అన్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మంత్రులకు పనిలేక వెళ్తారా? ఇలాగేనా ఒక కేంద్ర మంత్రి మాట్లాడేది. రైతుల జీవితాలతో ఇలాగేనా చెలగాటం ఆడేది. తెలంగాణ రైతులను ముంచడానికే కేంద్రం చూస్తోంది. రేపు రైతు పంట పండిస్తడు.. వీళ్లు తీసుకోరు.. అప్పుడు ఏం చేయాలె రైతులు. బీజేపీ కన్నా తెలంగాణ ప్రభుత్వం కోటి రెట్లు మెరుగ్గా ఉంది. తెలంగాణలో అత్యధిక పంట పండిస్తున్నందుకు మీరు ఓర్వడం లేదు.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.