హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 207 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. తాజాగా మరో 196 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 3897 కరోనా యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ 38,467 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.