హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్తోనే సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. శుక్రవారం సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫామ్ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని అమీర్పేటలో ఎన్నికల ప్రచారం(Election campaign) నిర్వహించారు. గడప గడపలో మంగళ హారతులు పట్టి, నుదుటన తిలకం దిద్ది మహిళలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ..చరిత్రలో ఎవరు ఊహించని స్థాయిలో అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి కేసీఆ(CM KCR) ఆధ్వర్యంలో జరిగాయన్నారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలో 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి పనులు 10 సంవత్సరాలలో చేశామని స్పష్టం చేశారు. ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలు ఎప్పటికి మరురవలేను. మీ బిడ్డగా ఆశీర్వదించండి. గెలిచాక నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు.