సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనార్టీ నాయకుడు ఇస్రార్ అహ్మద్ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy )సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అహ్మద్ మాట్లాడుతూ.. మంత్రి జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాను గత 10 సంవత్సరాలుగా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు.
సూర్యాపేట నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, మైనార్టీ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో సూర్యాపేట భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తున్న జగదీష్ రెడ్డి విజయానికి కిశోర్, బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు సయ్యద్ సలీం, అజీజ్, చల్లా లక్ష్మీకాంత్, తదితరులు పాల్గొన్నారు.