నిజామాబాద్ : మాదిగల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల(MLA Ganesh Bigala) అన్నారు. జనార్దన్ గార్డెన్స్లో నిర్వహించిన మాదిగ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. దళితులు ఆర్థికంగా వృద్ధి సాధించాలని దళితబంధు అమలు చేస్తున్నాం.
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలని స్థాపించి దళితులకు నాణ్యమైన విద్యని ఉచితంగా అందిస్తుందని తెలిపారు. విదేశాల్లో చదువుకొనే ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు డా.బి.ఆర్. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నిజామాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు.
నిజామాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందలన్నా ,సంక్షేమం పథకాలు అమలు కావాలన్నా కారు గుర్తుకి ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, కార్పొరేటర్లు కంపల్లి ఉమ, బట్టు రాఘవేందర్, మాజీ కార్పొరేటర్ కనకం సుధ, మాదిగ సంఘం నాయకులు సిద్ధి రాములు, దండు శేఖర్, మందమరి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.