బంగారం ధరలు భగభగమండుతున్నాయి. తొలిసారిగా లక్ష రూపాయల మైలురాయిని అధిగమించి రికార్డు నెలకొల్పింది పుత్తడి. దేశీయ రాజధానిలో పదిగ్రాములు బంగారం ధర రూ.1,800 ఎగబాకి లక్ష రూపాయల పైకి చేరుకున్నది.
రికార్డు గరిష్ఠస్థాయి సమీపంలో ధర ఉన్నందున, ఇతర ప్రపంచదేశాల కేంద్రబ్యాంక్ల బాటలోనే రిజర్వ్బ్యాంక్ బంగారం కొనుగోళ్లకు తగ్గిస్తున్నది.2023లో గత ఆరేండ్లలో ఎన్నడూలేనంత తక్కువ పుత్తడిని కొన్నది.