యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు జరిగాయి. మంగళవారం స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శత ఘటాభిషేకం జరిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వరుస సెలవులతోపాటు ఆదివారం కావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు భారీగా తరలివచ్చారు.