రెవెన్యూ శాఖలోని భూ భారతి పోర్టల్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8 నుంచి విధులకు హాజరుకావద్దంటూ ఆపరేటర్లకు తెలియజేసింది.
అవసరం ఉన్నన్ని రోజులు భూభారతి ఆపరేటర్ల సేవలను ప్రభుత్వం వినియోగించుకున్నది. ఇప్పుడు అవసరం తీరడంతో వారిని తొలగించడానికి సర్కార్ కుట్ర పన్నుతోందని పలువురు బీబీవోలు ఆవేదన చెందుతున్నారు.
భూ భారతి ఆపరేటర్లు(ఫీల్డ్ తెలంగాణ స్టాఫ్) రెవెన్యూ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తారు. భూముల క్రయ విక్రయాల్లో భూ భారతి సిస్టమ్ను ఆపరేట్ చేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏజె న్సీ ద్వారా వీరిని