కోదాడ రూరల్: జాతీయ రహదారిపై కారును అడ్డగించి దొంగతానికి పాల్పడిన నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేసిన్నట్లు సోమవారం డీఎస్పీ రఘు తెలిపారు. పట్టణ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్కి చెందిన పశువుల వ్యాపారి మహ్మద్ జమాల్ ఖురేషీ ప్రతి వారం కోదాడ సంతలో పశువు లను కోనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో వ్యాపార నిమిత్తం లక్షల్లో నగదును తీసుకుని రావ డం పరిపాటి.
అదే క్రమంలో గతంలో నార్కట్పల్లి, నకిరేకల్ పాంత్రాలలో దొంగలు దారి కాచి డబ్బును, పశువులను దోచుకుని పారి పోయారు. ఈ విషయమై బాధితుడు ఎక్కడా ఫిర్యాదు చేయలేదు. కాగా వ్యాపార నిమిత్తం ఈనెల 21న తన సొంత కారులో కోదాడకు వస్తుండగా పట్టణ శివారులో గుర్తు తెలియని దుండగులు దారి కాచి కారును హుజూర్నగర్ రోడ్డుకు మరలించి రూ. 3లక్షల నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణంలో కేసు నమోదు చేసుకున్నారు.
కేసు విచారణ నిమిత్తం ఈనెల 29 కోదాడ పశువుల సంతలో విచారణ జరుపుతుండగా అనుమానితులుగా భావిస్తున్న మహారాష్ట్రలోని ఉద్గీర్కు చెందిన భగిడి విక్కీ, కాలే రాజు, హైదరాబాద్ శంకర బజార్కు చెందిన కె.రాజులను అదుపులోకి తీసుకుని విచారించగా దోపిడి తామే చేసినట్లు ఒప్పుకుని, దోపిడికి సూత్రధారి ఖురేషీ కారు డ్రైవర్ మహ్మద్ సల్మాన్గా తేల్చారు. పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే బంధువు, మిత్రులతో కలసి యజమాని వద్ద దోపిడికి పథకం వేసినట్లు తెలిపాడు.
నిందితులను అదుపులోకి తీసుకుని నిందితుల నుంచి రూ. 2లక్షల 86వేల నగదు, వారు వినియోగించిన కారు, కత్తులు, మూడు మంకీ క్యాపులు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు డీఎస్పీ రఘు తెలిపారు. కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సీఐ నరసింహారావు, పట్టణ ఎస్ఐ రాంబాబు, ట్రాఫిక్ ఎస్ఐ క్రాంతికుమార్, సిబ్బంది ఎల్లారెడ్డి, ఉపేందర్, యాకూబ్, నరసింహారావు, సతీశ్లకు జిల్లా ఎస్పీ భాస్కరన్ అభినందనలు తెలిపారు.