పాలకవీడు, డిసెంబర్ 25 : మండలంలోని జాన్పహాడ్ దర్గా గ్రామ శివారులోని పెట్రోల్ బంక్లో ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగుడు రూ.1.20 లక్షలు చోరీకి పాల్పడ్డారు. రావిపహాడ్ గ్రామానికి చెందిన కాటా కోటిరెడ్డి జాన్పహాడ్ దర్గా శివారులో రెండేండ్లుగా పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నాడు. బ్యాంకులకు సెలవు కావడంతో రెండ్రోజులుగా డీజిల్, పెట్రోల్ అమ్మకంతో వచ్చిన డబ్బులను మేనేజర్ గదిలో పెట్టారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై బంక్లోకి వచ్చి మేనేజర్ గదికి చెందిన షట్టర్ను తన వెంట తెచ్చుకొన్న పరికరాలతో తెరిచి లోపల ఉన్న నగదును దొంగిలించాడు. ఈ సమయంలో అక్కడ పనిచేసే సిబ్బంది మేనేజర్ రూము పక్క గదిలో నిద్రిస్తున్నారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా చోరీ జరిగినట్లు గుర్తించినట్లు యజమాని కోటిరెడ్డికి తెలిపారు. దుండగుడు తలపై క్యాప్ పెట్టుకొని ముఖానికి మాస్క్ ధరించాడని తెలిపారు. చోరీ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు.