ఆత్మకూర్. ఎస్ : గ్రామాభివృద్ధికి ఉపాధి హామీ పథకం ఎంతో దోహదపడుతుందని అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. ఉపాధి హామీ పథకం పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి పనులపై మండల పరిషత్ కార్యాయలంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు గ్రామాల్లో 100 పని దినాలు తక్కువ కాకుండా పని కల్పించాలన్నారు. హరితహారానికి అన్ని నర్సరీల్లో మొక్కలు పెంచాలని వాటిని పశువుల నుంచి కాపాడేందుకు నర్సరీలకు ప్రహారీలు ఏర్పాటు చేయాలన్నారు.
పంచాయతీల్లో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసేల ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను బతికించాలన్నారు. ఇంటి పన్నులు 100శాతం వసూలు సూచించారు. పల్లెప్రగతిలో పెండింగ్లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయలన్నారు. పనుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
వ్యాక్సీనేషన్ తీసుకోవాలి..
అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిడ్ మొదటి, రెండో విడుత వ్యాక్సీన్ తప్పకుండా వేసుకోవాలని వేయించుకునేలా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వారం రోజుల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ సురేష్, డీఆర్డీఓ పీడీ కిరణ్కుమార్, డీపీవో యాదయ్య, ఎపీడీ రాజు, ఎంపీడీవో మల్సూర్నాయక్, ఎంపీఓ సంజీవ, ఏపీఓ ఈశ్వర్, పంచాయితీ కార్యదర్శులు ఉన్నారు.