బొడ్రాయిబజార్: మహిళల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రవేశ పెడుతున్నద ని వాటిని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఈనెల 24 నుంచి 26వరకు జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర 3వ మహాసభల సందర్భంగా గురువారం స్థానిక గాంధీపార్కులో ఏర్పాటు చేసిన మహిళా ఉద్యమ ఛాయా చిత్రాలతో కూడిన ఎగ్జిబిషన్ను ఆమె ప్రారంభించి మాట్లాడారు.
మహిళలు, చిన్నారుల, ఆడ పిల్లల రక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. మహిళల రక్షణ కు షీటీంలు, ఫోకస్, గృహ హింస వ్యతిరేక, వరకట్న వ్యతిరేక చట్టాలను తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్ర మహిళ ల రక్షణకు మహిళా కమిషన్ నిరంతరం పనిచేస్తుందన్నారు.
మహిళలకు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ మహిళ కమిషన్ ఉంటుందన్నారు. మహిళల రక్షణకు ప్రభుత్వం అనేక చట్టాలు చేసిందని వాటిని ప్రజలు అవగాహన చేసుకొని ముందుకు సాగాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆడ, మగ అనే తేడా లేకుండా పెంచాలన్నారు. సమాజంలో ఆడ పిల్లల పట్ల తక్కువ చూపు ఉండడం, ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. కుటుంబ వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడే సమాజంలో మహిళలకు రక్షణ ఉంటుందన్నారు.
బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మహిళల హక్కుల కోసం పోరాటాలు చేయాల్సిన అవస రం ఎంతైనా ఉందన్నారు. మహిళల విద్యాభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలను ఏర్పాటు చేసి వారికి ఉచి త విద్యను అందిస్తుందన్నారు. మహిళల హక్కులకై ఐద్వా నిర్వహిస్తున్న పాత్ర అభినందనీయమని ఐద్వా పోరాటం మూలంగా అనేక చట్టాలు వచ్చాయన్నారు. మహిళలకు ఎక్కడ సమస్యలుంటే అక్కడ ఐద్వా ఉంటుందన్నారు. ప్రభు త్వం దృష్టికి అనేక సమస్యలను, సూచనలను ఐద్వా నిరంతరం అందిస్తున్నదన్నారు.
ఉద్యమాలు కాకుండా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లను నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందడం సంతోషకరమన్నారు. ఐద్వా రాష్ట్ర మహాసభలు విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆశాలత, మల్లు లక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హైమావతి, రాష్ట్ర నాయకులు మా చర్ల భారతి, సమీనా అప్రోజ్, బండి పద్మ, ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జంపాల స్వరాజ్యం, మేకనబోయిన సైదమ్మ తదితరులు ఉన్నారు.