సూర్యాపేట, నవంబర్ 26 : నూతన కలెక్టరేట్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయత్రం కుడకుడలో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవనాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనుల వేగవంతంలో ఆర్అండ్బీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టరేట్లో చేపట్టాల్సిన పనులను సూచించారు. ఆయన వెంట ఆర్అండ్బీ ఈఈ యాకూబ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, గుత్తేదారుడు గోవర్ధన్రెడ్డి ఉన్నారు.
క్రిస్మస్ ఏర్పాట్లపై సమీక్ష
సూర్యాపేట : క్రిస్మస్ పండుగ ఏర్పాట్లపై కలెక్టర్ పాటిల్ హేమంత్కేవశ్ శనివారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మోహన్రావు, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, కిశోర్కుమార్, వెంకారెడ్డి, శంకర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.