సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 17 : దేశానికి సీఎం కేసీఆర్ సేవలు ఎంతో అవసరమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జన్మదినం పురస్కరించుకుని గురువారం సూర్యాపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొని కేక్ కట్ చేసి మాట్లాడారు. పేదలు, రైతుల బాధలు తీర్చడం కోసం పుట్టిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఈ రాష్ర్టానికి, దేశానికి ఆయన సేవలు ఎంతో అవసరమున్నాయన్న మంత్రి.. కేసీఆర్ ప్రధాని కావాలని టీఆర్ఎస్ కార్యకర్తగా తాను కోరుకుంటున్నానని అన్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తి యుగానికి ఒక్కరు పుడుతాడని ఆయనకారణ జన్ముడని మంత్రి కీర్తించారు. తెలంగాణ కోసం 2001లో ఒంటరిగా బయల్దేరిన కేసీఆర్.. కౌరవ సైన్యంలా చంద్రబాబు, రాజశేఖర్రెడ్డి ఉన్నా భయపడలేదన్నారు.
ఆమరణదీక్ష చేపట్టి చావు నోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించాడన్నారు. ఆంధ్రా పాలకుల హయాంలో జరుగని అభివృద్ధిని ఈ ఏడేండ్లలోనే చేసి చూపించారని కొనియాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను నేడు దేశమంతా గమనిస్తున్నదని, సీఎం కేసీఆర్ నిండు నూరేళ్ల పాటు ఆరోగ్యంగా ఉండి రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, ప్రముఖ సినీ దర్శకుడు శంకర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఒంటెద్దు నర్సింహారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, మార్కెట్ చైర్మన్ ఉప్పల లలితా ఆనంద్, టీఆర్ఎస్ రాష్ట్ర కర్యాదర్శి వై.వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కీసర వేణుగోపాల్రెడ్డి, మైనార్టీసెల్ అధ్యక్షుడు పూర్ణ శశికాంత్, రియాజ్, చివ్వెంల వైస్ ఎంపీపీ జీవన్రెడ్డి, బత్తుల ప్రసాద్, రమాకిరణ్, గుండపనేని కిరణ్, ముదిరెడ్డి అనిల్రెడ్డి, కొమ్ము ప్రవీణ్, వివిధ మతాలకు చెందిన కుల పెద్దలు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.