హైదరాబాద్ : సూర్యాపేట- గుంటూరు జిల్లాల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 43.74 టీఎంసీలకు చేరింది. విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఎగువ నుంచి వరద వచ్చే అవకాశం ఉండటంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తేందుకు అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. నదిలోకి ఎవరూ వెళ్లవద్దని సూచించారు.