నాగారం: గ్రామాల్లో బృహత్ ప్రకృతి వనాలతో పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందని తుంగతుర్తి శాసన సభ్యు డు డాక్టర్ గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామంలో రూ. 45.20 లక్ష ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న బృహత్ మెగా పల్లె ప్రకృతివనం పనులకు శంఖు స్థాపన చేసి హరితహారంలో భాగం గా మొక్కలు నాటి నీళ్లు పోసి మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆహ్లాదం, పచ్చదనాన్ని పంచేందుకు మండలంలో ఐదు బృహత్ మెగా పల్లె ప్రకృతి వనాలను పది ఎకరాల విస్తీర్ణంలోని ప్రభుత్వ భూముల్లో నిర్మాణం చేపడుతుందన్నారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను ఖర్చు చేయనుందన్నారు. ఇవి పూర్తి అయితే ప్రజలకు అద్బుతంగా పచ్చదనంగా గ్రామాలు తయారు అవుతాయన్నారు. సీతారామచంద్రస్వామి ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు మెగా పల్లె ప్రకృతివనం అందమైన వాతావరణం కల్పిస్తుందన్నారు.
రామాలయ అభివృద్ధి కోసం ముఖ్య మంత్రికి నివేదిక అందించామని త్వరిగతిన అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామాల సమ గ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. ఫణిగిరి గ్రామంలో పెండింగ్లో ఉన్న గోదామును పూర్తి చేయాలని అధి కారులను ఆదేశించారు. అలాగే గ్రామాల్లో రూ. 20లక్షల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మిస్తామన్నారు. ప్రగతి యూత్ క్లబ్ సభ్యులు గ్రంథాలయం నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం వర్ధమానుకోట, పస్తాల, ఈటూరు గ్రామాల్లో వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్, ఎంపీపీ కూరం మణి వెంకన్న, వైస్ ఎంపీపీ మణి మాల, మండల పార్టీ అధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, తహసీల్దార్ హరిశ్చంద్రప్రసాద్, గుండగాని అంబయ్యగౌడ్, సర్పంచ్లు గట్టు నర్సింహ్మరావు, పేరాల సరిత యాదగిరి, ఎంపీటీసీటీ జంపాల శోభ రాజు, వడ్డె పరుశరాములు, నర్సింహ్మరెడ్డి, బాలమల్లు, ఈదుల కిరణ్కుమార్, యల్లయ్య, ఎఈ సతీశ్, డీఈ మహేశ్, పొదిల రమేశ్, సర్పంచ్లు, పంచాయితీ కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.