మఠంపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మట్టపల్లిలో ఆదివారం చెంచులక్ష్మి, రాజ్యలక్ష్మి సమేత నరసింహుని కల్యాణాన్ని అర్చకులు కమనీయంగా నిర్వహించారు. తెల్ల వారుజామున సుప్రబాతసేవతో ప్రారంభించి ఆంజనేయస్వామికి ఆకుపూజ నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి,అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు.
పట్టు వస్ర్తాలతో అలంకరించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంతవైభవంగా కల్యాణతంతు నిర్వహిం చారు. అనంతరం భక్తులకు దైవదర్శనంతో పాటు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరి విజయ్కుమార్,ఈవో నవీన్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.