మఠంపల్లి: కృష్ణా నది తీరాన వెలసిన లక్ష్మీనరసింహస్వామి వారికి మంగళవారం దేవాలయ అర్చకులు నిత్యకళ్యాణం శాస్ర్తోక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, పట్టు వస్ర్తాలతో అలంకరించి
ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్యాణతంతు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, ఈవో సిరికొండ నవీన్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.