హుజూర్నగర్ టౌన్: పట్టణంలోని వీధులన్నింటినీ సీసీ రోడ్లుగా మార్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. పట్టణ ప్రగతి నిధుల నుంచి మంజూరైన రూ. 6లక్షలతో ఈ రోడ్డు పనులు ప్రారం భించినట్లు కౌన్సిలర్ దొంతగాని పద్మ తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే శానంపూడి వార్డులో గణపతి విగ్రహాం వద్ద మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న వితరణ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత గెల్లి రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర రావు, కౌన్సిలర్ మంజుల, అమర్నాథ్రెడ్డి, అమర్, హరిబాబు, శంకర్, ఎంపీటీసీ ముడెం గోపిరెడ్డి, సంపత్ ,రాము, హుస్సేన్, అధర్వ్, అర్జున్ పాల్గొన్నారు.