హుజూర్నగర్ టౌన్: కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకవచ్చిన నల్ల చట్టాలు వాటికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటాన్నే రైతన్న సినిమాగా తీశానని సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. బుధవారం హుజూర్నగర్కు వచ్చిన ఆయన సీపీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
ఢిల్లీలో రైతుల శాంతియుత ఉద్యమం చంపారన్ ఉద్యమంలా సాగుతుందన్నారు. రైతులు, బిల్ వాపసీ, ఘర్ వాపసీ పేరుతో నెలల తరబడి ఉద్యమం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవటం బాధాకరమన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు శ్రీరాములు, పాండు, వెంకట్రెడ్డి, రోషపతి, త్రివేణి, వెంకట నారాయణ, మురళి పాల్గొన్నారు.