సూర్యాపేట : సూర్యాపేట జిల్లా వైద్యాధికారికి కరోనా పాజిటివ్ వచ్చింది. నాలుగు రోజుల క్రితం కుటుంబంతో సహా తిరుపతికి వెళ్లి వచ్చారు. బుధవారం జ్వరం రాగా కొవిడ్ టెస్ట్ చేయించగా డీఎంహెచ్వో డాక్టర్ కోటాచలంకు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. వెంటనే ఆయన భార్య, పెద్ద కుమారుడు, కోడలు, చిన్న కుమార్తెతో పాటు మరో కుటుంబ సభ్యురాలికి టెస్ట్లు చేయించుకోగా అందరికీ పాజిటివ్ వచ్చింది. డీఎంహెచ్ఓ చిన్న కుమారుడు జర్మనీలో ఉంటుండగా గత నెల 19న ఇండియాకు వచ్చారు. వచ్చే ముందు జర్మనీలో టెస్ట్ చేయించకోగా నెగెటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన ఆ కుటుంబం మొత్తం క్షేమంగానే ఉండగా హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.
కాగా వీరిలో ఎవరికి కూడా ఒమిక్రాన్ లక్షణాలు లేకపోయినప్పటికీ జర్మనీ నుంచి వచ్చిన వ్యక్తికి సంబంధించిన శాంపిల్ సేకరించి జీనోం టెస్ట్కు పంపిస్తున్నట్లు ఇన్చార్జి డీఎంహెచ్వో డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ప్రజలెవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అలాగే ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించి భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు.