మునగాల: దేవాలయాలు ఆయా ప్రాంత సంస్కృతికి, సంప్రదాయాలకు చిహ్నాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. సోమవారం మండల పరిధి ఎస్ఎంపేట స్టేజీ వద్ద నూతనంగా నిర్మించనునన్న ముత్యాలమ్మ దేవాయశంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి తొడ్పటు అందిస్తుందని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎన్నో దేవాలయాలు అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సుంకర్ అజయ్కుమార్, నల్లపాటి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్, గుడి చైర్మన్ లోకనాథ్ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, సీతారాములు, సర్పంచులు దొంగరి రమా, శ్రీనివాసరావు, సంజీవ్, కోలా ఉపేందర్, నాయకులు,భక్తులు పాల్గొన్నారు.