పుస్తకంలేని ఇల్లు.. ఆత్మలేని శరీరం లాంటిది.
పెద్దలకూ నచ్చే పిల్లల కథలు!
పిల్లల కథ అయినా, పెద్దల కథ అయినా ఆర్సీ కృష్ణస్వామిరాజు చేతిలో బంగారు నగలా నగిషీలు పొందుతుంది. తాజాగా ఆయన రాసిన ‘కార్వేటినగరం కథలు’ ఈ విషయాన్ని మరోమారు రుజువు చేశాయి. ఈ పుస్తకంలో 30 బాలల కథలు ఉన్నాయి. ప్రతి కథా దేనికది ప్రత్యేకమే! ‘గంట ఎవరు కొడతారు?’ మన సమాజానికి ప్రతీక. ఎవరో అందిస్తే అనుభవించాలన్న తపన తప్ప, కష్టపడాలన్న ఆలోచన చాలామందిలో లేకపోవడం తెలిసిందే. పిల్లల కథలా ఉన్నా పెద్దలకూ మంచి చురక ఇది. స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని తెలిపే ‘గగన విహారం’, ‘జింకల వనం’ కథలు చాలా బాగున్నాయి. నమ్మకం చుట్టే భూమి తిరగాలి. అలాంటి రోజులు పోయాయి. వైద్యుడిని నమ్మలేని రాజు కథ ‘వైద్య పరీక్ష’ ఈ విషయాన్ని వెల్లడిస్తుంది. ‘ఆలస్యం ఇడ్లీ అమృతం’ కథ కృష్ణస్వామిరాజు మార్క్ హాస్యంతో ఆకట్టుకుంటుంది. ‘చెరపకురా చెడెదవు’ నీతి కోసం తీసుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. మొత్తానికి, ఇందులోని కథలన్నీ బంగారు కణికలే.
కార్వేటినగరం కథలు
రచన: ఆర్సీ కృష్ణస్వామిరాజు
పేజీలు: 108; ధర: రూ. 140
ప్రతులకు: ఫోన్: 93936 62821
తూరుపు సంధ్యారాగం
రచన: గన్నవరపు నరసింహమూర్తి
పేజీలు: 198, ధర: రూ. 150
ప్రచురణ: పాలపిట్ట బుక్స్,
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు, ఫోన్: 98487 87284
ఈ ముగ్గురూ ఒక్కరే
రచన: డా. కె.ముత్యం
పేజీలు: 224
ధర: రూ. 150
ప్రచురణ: దృష్టి ప్రచురణ
ప్రతులకు:
ఫోన్: 94403 99796
ఎన్నో ప్రశ్నలు కొన్నే జవాబులు
రచన: గంటి భానుమతి
పేజీలు: 116
ధర: రూ. 140
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 88976 43009
జీవన తాత్పర్యం
రచన: అన్నవరం దేవేందర్
పేజీలు: 68, ధర: రూ.125
ప్రచురణ: సాహితీ సోపతి
ప్రతులకు:
ఫోన్: 94407 63479
…? చంద్రప్రతాప్ కంతేటి