ఆధునిక విద్య కారణంగా రచయితలు కూడా అసంఖ్యాకంగా పుట్టుకొచ్చారు. వీరి చేతుల్లో కొన్ని వందల పుస్తకాలు రూపుదిద్దుకున్నాయి. వీటిలో ఏవి మంచివి అంటే చెప్పడం కష్టమైన పనే. కానీ సీనియర్ పాత్రికేయులు, కథకుడు, విమర్శకులు, బహు గ్రంథ రచయిత చీకోలు సుందరయ్య వెలువరించిన సంకలనం ‘చదివి చూద్దాం’ దీనికి సమాధానంగా పరిగణించవచ్చు. ఇందులో గడచిన వందేండ్లలో తెలుగు సాహిత్యంలో వచ్చిన 123 ప్రసిద్ధ పుస్తకాలను సుందరయ్య సమీక్షించారు.
ముద్దుకృష్ణ ‘వైతాళికులు’, పఠాభి ‘ఫిడేలు రాగాల డజన్’, విశ్వనాథ ‘కిన్నెరసాని పాటలు’, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ తదితర కవితా సంకలనాలు, మధుర సుబ్బన్న దీక్షితులు ‘కాశీ మజిలీ కథలు’, మధురాంతకం రాజారాం ‘కథాయాత్ర’, కాళీపట్నం రామారావు ‘యజ్ఞం’ మొదలైనవారి కథా సంకలనాలు, విశ్వనాథ ‘వేయిపడగలు’, చలం ‘మైదానం’, తెన్నేటి సూరి ‘ఛంఘిజ్ఖాన్’, దాశరథి ‘చిల్లరదేవుళ్ళు’, రావూరి భరద్వాజ ‘పాకుడురాళ్ళు’ తదితర నవలలు, ఆత్మకథలు, నాటకాల పరిచయం ఈ పుస్తకం ప్రత్యేకత. తెలుగు సాహితీ అభిమానులకే కాకుండా… నవతరం పాఠకులకు కూడా ‘చదివి చూద్దాం’ చదివితే అసలు ఎలాంటి సాహిత్యం చదవాలో, ఎందుకు చదవాలో, ఏ కోణంలో చదవాలో అర్థమవుతుంది.
రచన: చీకోలు సుందరయ్య
పేజీలు: 546; ధర: రూ. 240
ప్రచురణ: అక్షరం ప్రచురణలు
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాలు
ఫోన్: 90300 00696
సంపాదకులు: వంగూరి చిట్టెన్ రాజు
పేజీలు: 254;
ధర: ఉచితం
ప్రచురణ: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
ప్రతులకు: ఫోన్: 80963 10140
రచన: డా॥ షేక్ హసీన
పేజీలు: 208;
ధర: రూ. 200
ప్రతులకు: అన్ని పుస్తక విక్రయ కేంద్రాలు
రచన: సుంకరి కృష్ణప్రసాద్
పేజీలు: 134;
ధర: రూ. 60
ప్రతులకు: 94928 84122