‘… నాకెప్పుడు దేముడొస్తిందో నాకు తప్ప ఇంగెవురికీ తెల్దు. దేముడ్ని నమ్మనోల్లు నన్ను దొంగ దేవుడమ్మని ఎక్కిరిస్తారు..’ అంటూ మొదలవుతుంది ‘దేవుడమ్మ’ కథ, కథల పుస్తకం. ఈ కథలో దేవుడమ్మ నిజంగానే దొంగ దేవుడమ్మ. ఇంట్లో అణచివేతను భరించలేని పరిస్థితుల్లోనే దేవుడమ్మ ఆ వేషం వేస్తుంది. తను కావాలని అనుకున్నప్పుడు దేవత పూనుతుంది. అలా అత్త ఆరళ్లను తట్టుకుని తన కాపురం నిలబెట్టుకుంటుంది. మన సమాజంలో దేవతలు పూనేవారికి కూడా ఒక్కొక్కరికి ఒక్కో కథ తప్పకుండా ఉండే ఉంటుంది. ఇలాంటి మరో పది కథలతో ఝాన్సీ పాపుదేశి తీసుకువచ్చిన సంకలనం ‘దేవుడమ్మ’. మతం ముసుగులో లైంగిక దోపిడీకి గురయ్యే మాతంగి స్త్రీల వెతలను హృద్యంగా చిత్రించే ‘మాతమ్మ ప్రశ్న’, భార్యకూ తన రోగాన్ని అంటగట్టే ఓ రోగిష్టి భర్త కుత్సితత్వాన్ని అక్షరీకరించిన ‘అనుమానం’, చిత్తూరు తండాల నుంచి పూనా అంగడికి తరలిపోయే అబలల కన్నీటి కథ ‘సావు’ గ్రామీణ స్త్రీల వ్యథలను చిత్రిస్తాయి. అర్ధనారిగా జీవితాన్ని గడిపే తార వేదనను కండ్లకు కట్టే ‘ద్వైతం’, విజయనగర సామ్రాజ్య పతనం నేపథ్యంలో అద్భుతంగా చిత్రించిన ప్రేమకథ ‘ఏకపర్ణిక’. ఇలా ‘దేవుడమ్మ’లోని కథలు జానపద, నాగరిక స్త్రీల వ్యథార్త జీవిత యథార్థ చిత్రణతో సాగుతూ పాఠకులలో సున్నితత్వాన్ని మేల్కొల్పుతాయి.
రచన: ఝాన్సీ పాపుదేశి
పేజీలు: 131; వెల: రూ. 150
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు
రచన: గంటి భానుమతి
పేజీలు: 116
వెల: రూ. 140
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు
ఫోన్: 88976 43009
రచన: కె.జె.రమేష్
పేజీలు: 56
వెల: రూ. 50
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు
ఫోన్: 94401 11105
రచన: రాజేందర్ జింబో
పేజీలు: 138
వెల: రూ. 100
ప్రతులకు: 94404 83001
చింతలపల్లి హర్షవర్ధన్