Mother’s Day 2022 | ‘మాతృదేవోభవ’ అని తొలి నమస్కారం తల్లికి చెప్పింది సనాతన ధర్మం. ‘తల్లి పాదాల కింద స్వర్గం’ ఉందని అమ్మ గొప్పదనాన్ని చాటిచెప్పింది ఖురాన్. ‘తల్లి హృదయం పిల్లల తరగతి గది’ అని శ్లాఘించింది క్రైస్తవం. మతాలు ఏవైనా, ప్రాంతాలు వేరైనా, మనుషులు ఎవరైనా.. అమ్మకే అగ్రపీఠం. ‘భగవంతుడు అన్నిచోట్లా ఉండలేడు కాబట్టి తల్లిని సృష్టించాడు. ముల్లోకాలలో తల్లి కంటే శ్రేష్ఠమైన వారు ఎవ్వరూ లేరు. గాయత్రిని మించిన మంత్రం లేదు, గంగను మించిన తీర్థం లేదు, విష్ణువును మించిన ప్రభువు లేడు, శివుణ్ణి మించిన పూజ్యుడు లేడు. తల్లిని మించిన దైవమూ లేదు’ అన్న మాటలు అమ్మ ప్రేమంత సత్యమైనవి.
శ్రీరామ చంద్రుడి వంటి యుగపురుషులు, శివాజీ లాంటి చారిత్రక వీరులు, ఆది శంకరుల వంటి ధార్మిక వరేణ్యులు ఇలా ఎందరెందరో జగద్విఖ్యాతి చెందడానికి, ఆదర్శమూర్తులుగా నిలవడానికి అమ్మే మూలం. బిడ్డను కనడానికి తల్లి అంతులేని వేదన అనుభవిస్తుంది. ఆ బిడ్డను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఎప్పుడూ పరితపిస్తుంది. తన ఆశలనే బిడ్డ ఆశయాలుగా పెంచి పెద్ద చేస్తుంది.
పేగు బంధాన్ని పొత్తిళ్లలోకి తీసుకోవడానికి అమ్మ నవమాసాల యుద్ధం చేస్తుంది. తన ‘గర్భ’గుడిలో నెల నెలకూ బరువు పెరుగుతున్నా, గర్భస్థ శిశువును మోస్తూనే ఉంటుంది. తన శరీరంలో ఎన్ని మార్పులు వస్తున్నా.. ఆనందంగా స్వీకరిస్తుంది. ప్రసవం అయ్యేవరకూ బిడ్డను మోస్తుంది. ప్రాణాలొడ్డి, ప్రసవవేదనను భరించి బిడ్డకు జన్మనిస్తుంది. తన రక్తాన్ని క్షీరంగా మార్చి తన బిడ్డను పోషిస్తుంది. ఆ చిన్నారి బోసినవ్వులు చూసి ఇన్నాళ్ల శ్రమనూ మర్చిపోతుంది. బిడ్డ ఆలనాపాలన చూడటంతోపాటు తొలి గురువు అవుతుంది. ఏ మనిషికైనా అమ్మ ఒడే మొదటి బడి. ‘నాస్తి మాతృసమః గురుః’- తల్లిని మించిన గురువు లేదు అని వ్యాస మహర్షి కొనియాడాడు.
అమ్మ చేతి గోరు ముద్ద అమృతం కన్నా రుచి. తన ప్రేమనంతా రంగరించి గోరు ముద్దలు పెడుతుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఆహారంతో బిడ్డల ఆకలి తీరితే, ఆ చిట్టి బొజ్జ నిండిందన్న తృప్తితో అమ్మ ఆకలి తీరుతుంది. అదీ.. అమ్మ ప్రేమంటే! పాండుపుత్రుడు భీముడికి ఎంత తిన్నా ఆకలి తీరేది కాదు. కానీ, తల్లి కుంతీదేవి చేత ఒక్క ముద్ద తిన్నా కడుపు నిండిపోయేది. పొట్ట నిమురుకుంటూ, తేన్చుకుంటూ.. తృప్తిగా వెళ్లేవాడు. భీముడి ఆకలి అమాంతం తీరడానికి కారణం కుంతీదేవి కన్నప్రేమే!
మాతృవందనం
ఆదిశంకరుడు సన్యాసాశ్రమం తీసుకునే క్రమంలో తల్లి ఆర్యాంబకు ఒక వాగ్దానం చేస్తాడు. ‘అమ్మా నీవు తలుచుకున్నంత మాత్రాన నీ ముందు ఉంటాను’ అని మాటిస్తాడు. ఏండ్లు గడిచిపోతాయి. ఆర్యాంబకు అంతిమ ఘడియలు సమీపించాయి. ‘నేను తలచిన వెంటనే వస్తానన్నావు కదా శంకరా!’ అని మనసులో తలుచుకుంది ఆర్యాంబ. తల్లి స్థితిని గ్రహించాడు శంకరుడు. వెంటనే శ్రీకృష్ణుణ్ని ధ్యానించాడు. ‘ఏం కావాల’ని శ్రీకృష్ణుడు అడిగితే.. ‘భీష్మాచార్యుడికి మోక్షమిచ్చినట్లుగా, నా మాతృమూర్తికీ మోక్షం ప్రసాదించమ’ని కోరాడు. కాలడిలో కొడుకు రాకకోసం తల్లడిల్లుతున్న శంకరుడి తల్లికి ఇంతలో ఎవరో వచ్చిన అలికిడి అయింది. చటుక్కున లేచి…. ‘శంకరా!’ అని అక్కడికి వచ్చిన ఒక పసిబాలుడిని గుండెకు హత్తుకుంది. బాలుడి ఒంటి నిండా ఆభరణాలను గమనించి ‘శంకరుడు సన్యాసి కదా! ఈ ఆభరణాలు ఎలా వచ్చాయ’ని అనుకుంది. బరువెక్కిన కనురెప్పలను మెల్లగా తెరిచి చూసింది ఆర్యాంబ. అక్కడ తను అనునిత్యమూ పూజించే గురువాయూరు శ్రీకృష్ణుడు నిలిచి ఉండటం గమనించింది. ఆర్యాంబ మహదానందంతో ‘అప్పా! నోరు తెరిచి, నీ నామజపం చేసే శక్తి కూడా లేని ఈ దీనురాలిని ఆఖరిక్షణాలలో చూసేందుకు వచ్చావా?’ అని పలికింది.
శ్రీకృష్ణుడు వెంటనే ‘నీ పుత్రుని ఆదేశం. రాకుండా ఉండగలనా? అమ్మను చూడకుండా ఉండగలనా’ అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు. అదే సమయంలో ఆదిశంకరుడూ అక్కడికి వచ్చాడు. ఉప్పొంగిన ఆనందంతో, ఆ మాతృమూర్తి శంకరునితో… ‘నాయనా! నా భాగ్యమేమని చెప్పను? నిన్ను పుత్రునిగా పొంది నేను తరించాను. సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడినే నా ముందు నిలబెట్టావు’ అంటూ ఆనందబాష్పాలు కార్చింది.
‘గోపాలుడిని నేను నిలబెట్టడమేమిటి? నేను జన్మించినది మొదలు నీవు నా కోసం పడిన శ్రమకు, నాపై కురిపించిన ప్రేమకు బదులుగా నేనేమీ చేయలేకపోయాను. సాక్షాత్తూ భగవంతుడే మానవరూపంలో పుట్టినా.. మాతృప్రేమకు సాటిగా, ఎంత సేవచేసినా.. కన్నతల్లి రుణం అణువంతైనా తీర్చలేడు. నేనైనా అంతే. నేను చేయగలిగినదంతా నీ దివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రణామం ఒక్కటే’ అని అమ్మపాదాలపై మోకరిల్లాడు ఆదిశంకరుడు. తల్లి రుణాన్ని తీర్చుకోలేమని లోకానికి చాటిచెప్పాడు.
రాజపత్నీ గురుపత్నీ, భ్రాతృపత్నీ తథైవ చ,
పత్నీ మాత స్వమాతా చ, పంచైతాః మాతరః స్మృతాః.
దేశాన్ని పాలించే రాజు భార్య, గురువు భార్య, సోదరుని/ స్నేహితుని భార్య, భార్య తల్లి (అత్త), సోదరి ఈ ఐదుగురినీ మాతృమూర్తులుగా భావించాలి. వీరిపట్ల పూజ్యభావంతో మెలగాలి. సొంత తల్లిని ఎలా గౌరవిస్తారో, వీరినీ అంతే ఆదరించి గౌరవించాలి అంటుంది ఆర్ష ధర్మం. అంతేకాదు, ప్రతి స్త్రీలోనూ మాతృమూర్తిని దర్శించమని చెబుతుంది.
‘గురూణాం మాతా గరీయసీ’- గురువులందరిలోనూ, జన్మనిచ్చిన అమ్మ గొప్పది అని చాణక్యుడి నీతి వచనం.
అస్సామీ, బెంగాలీ, హిందీ, మరాఠీ, తమిళం, పంజాబీ, తెలుగు మొదలైన భాషలలో : మా, ఆయి, అమ్మ
స్పానిష్: మామా, మా, మామి
చైనీస్, పోలిష్, జర్మన్, డచ్, రష్యన్, స్లోవాక్: మామా
ఫ్రెంచ్, పర్షియన్: మామన్, ఒడియా: బౌ/బావ్, హీబ్రూ: ఎమ్
అనేక దక్షిణాసియా సంస్కృతులలో, మధ్యప్రాచ్యంలో: అమ్మ, ఓమా, అమ్మి
1. మదర్: మాక్సిం గోర్కీ
2. బికమింగ్: మిచెల్ ఒబామా
3. ఓన్ ఇట్: ఓప్రా విన్ ఫ్రే
4. ఫైన్డింగ్ మీ: వయోలా డేవిస్
5. మామ్ & మీ & మామ్: మయా ఏంజెలో
6. ద కలర్ వాటర్: జేమ్స్ మెక్ బ్రైడ్
7. ఆఫ్ విమెన్ బోర్న్: యాన్డ్రీనీ రిచ్
8. బిలవ్డ్: టోనీ మోరిసన్ 9. ద ఫెమిషెడ్ రోడ్: బెన్ ఒక్రీ
10. దోస్ బోన్స్ ఆర్ నాట్ మై చైల్డ్: టోనీ బంబారా
1. కాన్వర్సేషన్స్ విత్ మదర్
2. ద స్టోరీ ఆఫ్ ఏ మదర్
3. డైరీ ఆఫ్ మై మదర్ అండ్ ఫాదర్
5. ఆల్ ఎబౌట్ మై మదర్
6. ద మదర్ ఆఫ్ టియర్స్
7. డియర్ మదర్
8. లిటిల్ మదర్, 9. మదర్, 10. మదర్ థెరీసా ఆఫ్ కలకత్తా
1. అమ్మ రాజీనామా
2. రఘువరన్ బీటెక్
3. మాతృదేవోభవ
4. సింహరాశి
5. కె.జి.ఎఫ్
6. ఛత్రపతి
7. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
8. యమలీల 9. బిచ్చగాడు
10. నాని
1. మదర్ ఇండియా
2. మమతా
3. దీవార్
4. భావన, 5. బేటా
6. కరణ్ అర్జున్
7. కభీ ఖుషీ కభీ గమ్
8. పా, 9. కహానీ
10. మామ్
ప్రతివ్యక్తికి ప్రథమ గురువు తల్లే. మాటలు నేర్పించడం, నడకలు నేర్పించడం.. అన్నీ తల్లి ద్వారానే నేర్చుకుంటాం. భాష.. కేవలం భావాలు వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సాధనమే కాదు, ఒక జాతి ఉనికిని, సంస్కృతిని మొత్తంగా జీవన విధానాన్నే పరిచయం చేస్తుంది. మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. ఇది అప్రయత్నంగా వస్తుంది. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి.
అమ్మకు జేజేలు.
అమ్మ ప్రేమకు జేజేలు!
“మాతృదినోత్సవానికి ఆర్టీసీ కానుక.. అమ్మలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం”
“Mother’s Day : అమ్మ కోసం నెదర్లాండ్లో ఇద్దరు భారతీయ యువతుల పోరాటం”
Mother’s Day Special : అమ్మ కడుపు చల్లగా
Mother’s day special: అమ్మ కోసం ఐదు బహుమతులు (ntnews.com)