టీవీలు, డిష్ కనెక్షన్లు పల్లెపల్లెకూ చేరుకోవడంతో సమాజంలో జానపద కళలకు ఆదరణ తగ్గిపోయింది. ఈ ప్రభావం 1990వ దశకం మధ్యనాటికే కనిపించడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తోలుబొమ్మల కళాకారుల ప్రాభవానికి తెరపడినట్టయింది. ఓ గ్రామంలో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లిన ఓ తోలుబొమ్మల కళాకారుల కుటుంబానికి ఎదురైన దుస్థితిని ‘కడుపాత్రం’ కండ్లకు కడుతుంది. ఇందులో ప్రధానపాత్ర వెంకటరావు జీవితం తోలుబొమ్మలాటలోనే విషాదాంతమైన వైనం కనిపిస్తుంది. ఆధునికత మోజులో సంస్కృతిని మరిచిపోతూ కళాకారుల కడుపు ఆత్రాన్ని పట్టించుకోవడం లేదనే సందేశాన్ని ఇస్తూ సాగుతుంది ఈ కథ. ఇలాంటి మరో పద్దెనిమిది కథలతో తవ్వా ఓబుల్ రెడ్డి తెచ్చిన సంకలనం ‘కడుపాత్రం’.
కరువు కాలం ఎండల్లో అన్నార్తుల బాధను ‘బుడుక్కుతినేటోళ్లు’ చిత్రిస్తుంది. వానల కోసం వేచిచూస్తూ నిరాశపడిన ప్రజల అవస్థను ‘ఆకాశం నవ్వింది’ తెలియజేస్తుంది. తరతరాలుగా దోపిడీకి గురవుతున్న అణగారిన వర్గాల ప్రజల అశక్తతను ‘ముంపు’ వివరిస్తుంది. ముఠా రాజకీయాల్లో తలదూరిస్తే మామూలువాళ్లకు జరిగే కష్టనష్టాలను ‘పాచిక’ విడమరుస్తుంది. డబ్బు, పరపతి కుటుంబాలను ఎలా వేరుచేస్తాయో ‘సూతకం’ కథ తెలుపుతుంది. ఓబుల్ రెడ్డి కలం నుంచి జాలువారిన ‘కడుపాత్రం’ కథలు రాయలసీమ- ముఖ్యంగా కడప ప్రాంతం జీవనచిత్రం, భౌగోళికత, అక్కడి ప్రజల నుడికారం, సామెతలకు పెద్దపీట వేశాయి.
రచన: తవ్వా ఓబుల్ రెడ్డి
పేజీలు: 154; ధర: రూ. 150
ప్రచురణ: తెలుగు సమాజం
ప్రతులకు: 94400 24471
రచన:పి.చంద్రశేఖర ఆజాద్
పేజీలు: 157;
ధర: రూ. 150 ప్రచురణ:ఇయర్హుక్ పబ్లికేషన్స్
ఫోన్: 91600 03371
రచన: పెన్మెత్స సుబ్బరాజు
పేజీలు: 159;
ధర: రూ. 150
ప్రతులకు: నేత్రదాన ప్రోత్సాహక సంఘం
ఫోన్: 08814 228228
రచన: చలపాక ప్రకాశ్
పేజీల: 124;
ధర: రూ. 125
ప్రతులకు: ఫోన్: 92474 75975